Home వార్తలు పెద్ద పక్షిలా భారీ శబ్దంతో రాకపోకలు..

పెద్ద పక్షిలా భారీ శబ్దంతో రాకపోకలు..

విమానాన్ని చూసేందుకు ప్రజల ఆసక్తి

0 comment

గన్నవరం విమానాశ్రయం కు భారీ విమానం రాక
అమరావతి :
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్బస్ 340 ఎయిర్ క్రాఫ్ట్ మొదటి సారి వచ్చింది. హజ్ యాత్రికులను తీసుకెళ్లేందుకు లెజెండ్ ఎయిర్లైన్స్కు చెందిన ఈ విమానం సోమవారం ఉదయం ఇక్కడికి చేరుకుంది. పెద్ద విమానానికి సెరిమోనియల్ వాటర్ కానన్ సలైట్తో విమానాశ్రయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అంతర్జాతీయ హోదా వచ్చిన తర్వాత భారీ విమానాల రాకపోకలు వీలవుతుందని వినడమే కాని ఎప్పుడూ చూడలేదని స్థానికులు పేర్కొన్నారు. పెద్ద పక్షిలా భారీ శబ్దంతో రాకపోకలు సాగించిన ఈ విమానాన్ని చూసేందుకు ఆసక్తి కనబర్చారు. సాధారణ విమానంలో 200 మంది ప్రయాణం చేస్తారు. కానీ ఎయిర్బస్ 340 ఎయిర్ క్రాఫ్ట్ సుమారు 300 నుంచి 350 మంది ప్రయాణం చేయవచ్చు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4