Home ఆరోగ్యం గుండెల్లో బాణం దిగినా బ్రతికాడు..

గుండెల్లో బాణం దిగినా బ్రతికాడు..

గుండెకు ఆనుకొని దిగిన బాణం..ప్రాణం పోసిన నిమ్స్

0 comment

శస్త్ర చికిత్స ద్వారా తొలగించిన కార్డియోథొరాసిక్ వైద్యుల

హైదరాబాదా :

ఓ ఆదివాసి యువకుడికి నిమ్స్ వైద్యులు ప్రాణం పోశారు. ప్రమాద వశాత్తూ శరీరంలోని గుండెకు దగ్గరగా దిగిన భాణంతో మూడు రోజుల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతికాడు.

ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూర్ ప్రాంతానికి చెందిన సోది నంద (17) గోతి కోయ తెగకు చెందిన వ్యక్తి. వారం రోజుల క్రితం అడవిలో ఉన్న సమయంలో ప్రమాద వశాత్తూ శరీరంలోకి బాణం దిగింది. కుటుంబీకులు వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు . అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కి తీసుకెళ్లారు. పరిస్థితి విషమిస్తోందని ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ ఎమర్జెన్సీకి శుక్రవారం సాయంత్రం తీసుకొచ్చారు. ఇక్కడ కార్డియోథొరాసిక్ విభాగాధిపతి అమరేశ్వర రావు, డాక్టర్ గోపాల్ పరీక్షించారు. గుండె, ఊపిరితిత్తుల మధ్య భాణం చొచ్చుకుపోయి ఉన్నట్లు గుర్తించారు.

 

నాలుగు గంటలు శ్రమించి.

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నంద ను కాపాడేందుకు అమరేశ్వర రావు, గోపాల్ వైద్య బృందం అతనికి ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. నాలుగు గంటల పాటు శ్రమించి శరీరం నుంచి బాణాన్ని పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్యంగా ఉన్నారని ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.

స్పెషల్ కేసుగా పరిగణించి ఉచితంగా చికిత్స.

పక్క రాష్ట్రానికి చెందిన యువకుడికి పరిస్థితిని డైరెక్టర్ నగరి బీరప్ప ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. స్పెషల్ కేసుగా పరిగణించి ఉచితంగా శస్త్ర చికిత్స చేసినట్లు బీరప్ప చెప్పారు. ఎంతో శ్రమించి వైద్యం అందించిన కార్డియోథొరాసిక్ వైద్య బృందాన్ని డెరైక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4