హైదరాబాద్ లోక్సభ పరిధిలో హోమ్ ఓటింగ్
+ ఓటుహక్కు ను వినియోగించుకున్న దివ్యాంగుడు
+ నియోజకవర్గం లో 121 మంది ఓట్ ఫ్రమ్ హోమ్ కు అర్హులు
ఫోటో రైటప్ 03వీవీ.జేపీజీః హోమ్ ఓటింగ్ ప్రక్రియలో ఓటుహక్కు ను వినియోగించుకున్న దివ్యాంగుడు (ఫోటో కామన్లో ఉంది. గమనించగలరు)
––
హైదరాబాద్ :
హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో వద్ధులు, వికలాంగుల కోసం
ఓట్ ఫ్రమ్ హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం ఎన్నికల
రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఎన్నికల సిబ్బందితో కలిసి
ఓటరు ఇంటి వద్దకే వెళ్లి ఓటు వేయించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓట్ ఫ్రమ్ హోం లో భాగంగా గుడి మల్కాపూర్ తాళ్లగడ్డలో దివ్యాంగుడు ఎన్ భాస్కర చారి
తన ఇంటి నుంచే ఈసీఐ నిబంధనలకు అనుగుణంగా ఓటింగ్ కంపారŠెట్మంట్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు .ఈ సందర్భంగా దివ్యాంగుడికి ఎన్నికల అధికారి అనుదీప్ దురిశెట్టి అభినందించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ 85 సంవత్సరాలు దాటిన వద్ధులు,40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ఇంటి నుంచే ఓటు వేసేలా కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని తెలిపారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 121మంది హోమ్ ఓటింగ్ వినియోగించుకోనున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది, బిఎన్ఓలు తదితరులు పాల్గొన్నారు.